స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పుష్ప' మువీతో ఒక్కసారిగా అమ్మడి ఫాలోయింగ్ తారాస్థాయికి చేరింది
అయితే తాజాగా సోషల్మీడియాలోని ఆకతాయిలు రష్మిక మందన్న టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేశారు
ఇప్పటికే రష్మికపై రెండు సార్లు మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు
సోషల్మీడియా తార జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి వీడియో క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే
ప్రస్తుతం చిత్రసీమలోని నటీమనులను టార్గెట్ చేస్తూ వెలువడుతోన్న డీప్ ఫేక్ వీడియోలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి
అవి ఫేక్ వీడియోలని.. వాటిని ఎవరూ నమ్మొద్దని ఫ్యాన్స్ సైతం పోస్టులు పెడుతున్నారు
కొత్త సాంకేతికను దుర్వినియోగం చేస్తూ పలువురు ఆకతాయిలు ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు
ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఐటీ శాఖ సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక-‘యానిమల్’, 'పుష్ప-2' మువీల్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది