అందం కన్నా.. అభినయం ప్రధానం అనుకున్నా..

అందం కన్నా.. అభినయం ప్రధానం అనుకుంది.. గ్లామర్‌ షో చేయకుంటే సినీ కెరీర్‌లో ముందుకు వెళ్లడం అసంభవం అనుకునే వాళ్ల నోర్లు మూయించింది నటి సాయిపల్లవి..

అందుకే గ్లామర్‌ పాత్రలకంటే గ్రామర్‌ పాత్రలకే ఓటు వేస్తుందామె. ఈ దృక్పథంతోనే కనీసం మేకప్‌ కూడా లేకుండా ఎంపిక చేసుకున్న పాత్రలకు ప్రాణం పోస్తోంది

ప్రేక్షకులు నటిగా అసలు తనను స్వీకరిస్తారా? అనే సందేహంతో కెరీర్‌ మొదలుపెట్టిన సాయిపల్లవి తెలుగు, తమిళ, మలయాళ  చిత్ర పరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది

సాయి పల్లవి సొంతూరు ఊటీకి దగ్గరలో ఉన్న కోటగిరి గ్రామం. ఆమె తండ్రి సెందామరై కన్నణ్‌ కస్టమ్స్‌ అధికారి. తల్లి రాధ నాట్యకారిణి

సాయిపల్లవి ఆమె చెల్లెలు పూజా కవల పిల్లలు. తల్లి చేసే నృత్యం చూస్తూ పెరగడంతో తమకూ నాట్యంపై ఆసక్తి పెరిగానంటోందిది ఈ హైబ్రిడ్‌ పిల్ల

అలా తన 8వ తరగతిలో స్కూల్‌లో డ్యాన్స్‌ ప్రదర్శన ఇస్తున్నప్పుడు చూసిన ఓ సినిమా ఏజెన్సీ వాళ్లు చిన్న పాత్ర కోసం నటి సాయిపల్లవిని సంప్రదించారట

నిజానికి సాయిపల్లవికి లెక్కలు అంటే మహా భయం. ఆ క్లాస్‌ నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచనతో సినిమా విషయం వాళ్ల అమ్మకి చెప్పి ఒప్పించిందట

అలా తెరపై తొలిసారి ‘ధామ్‌ ధూమ్‌’ (తమిళం)లో కంగనా రనౌత్‌ పక్కన నటించింది. అలాగో మరో తమిళ సినిమాలో మీరా జాస్మిన్‌ క్లాస్‌మేట్‌గా నటించింది

ఆ తర్వాత తమిళంలో స్టార్‌ విజయ్‌, తెలుగులో ఈటీవీ నిర్వహిస్తోన్న ఢీ రియాలిటీ షోల్లో పాల్గొని ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాత సినిమా ఆఫర్లు వరుస కట్టాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది