యావత్ ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్-పాక్ ఉత్కంఠ పోరులో టెన్షన్ మొదలైంది. మొదట టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత ఓవర్లలో 266 పరుగులు చేసి పాక్ ముందు 267 పరుగుల టార్గెట్ ఉంచింది. శ్రీలంకలోని పల్లెకలె మైదానం ఈ మ్యాచ్ జరిగింది. తొలి మ్యాచ్ విజయం సాధించి ఆసియా కప్ 2023 టోర్నీ లో మరో విన్నింగ్ కోసం ఎదురు చూస్తుంది టీమ్ ఇండియా. నేపాల్ పై విజయం సాధించి మంచి ఉత్సాహంతో పాక్ ఉంది. ఆసియా కప్ చరిత్రలో భారత్-పాక్ మొత్తం 17 సార్లు తలపడగా తొమ్మిది సార్లు టీమిండియా గెలిచింది.
267 పరుగు టార్గెట్ ముందు ఉంచుకొని చేజింగ్ కోసం పాక్ బరిలో దిగనుండగా ఒక్కసారే వర్షం మొదలైంది. అయితే వర్షం విరామం ఇస్తుందని భావించినా.. కంటిన్యూగా పడటంతో మ్యాచ్ ని నిలిపివేశారు ఎంపైర్లు. ఇదిలా ఉంటే శ్రీలంకలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే శ్రీలంక వాతావరణ శాఖ అంచనా వేసింది. దానికి తగ్గట్టుగానే వర్షం పడటంతో మ్యాచ్ ఆపివేశారు.
భారత్ ప్లేయర్లు : రోహిత్ శర్మ (కెప్టెన్), , విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్ శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా
పాకిస్థాన్ ప్లేయర్లు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్,, షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ నవాజ్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ
