ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం పరంగా వేడి మొదలైంది ఐతే దీనికి కారణం ఎన్నికల సమయం దగ్గరపడుతుండడమే. ఐతే వారిలో కొంతమంది ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశపడి చివరికి అది దక్కని కొంతమంది నేతలు అసమ్మతి సెగలు రగుల్చుతున్నారు. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ నుంచి బరిలో దిగతున్న అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఐతే జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇద్దరి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ ఐయ్యింది.
గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ బాగా నడిచింది. టికెట్ తనకంటే తనకే వస్తుందంటూ పోటాపోటీగా ఇద్దరూ నేతలు ఎవరికి వారు ప్రకటనలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఘాటు విమర్శలు చేసుకున్నారు. ఐతే ఈ విమర్శలు చివరికి పరిధులు దాటి వ్యక్తిగత విషయాలపై కామెంట్స్ చేసుకునే వరకు కూడా వెళ్లాయి. వారిద్దరూ మీడియా వేదికగానే బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు.
ఒకటే పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఇపుడు కన్ప్యూజన్ మొదలైంది. చివరికి ఇటీవల విడుదల చేసిన లిస్ట్ లో కడియం శ్రీహరికే టికెట్ను బీఆర్ఎస్ ఫైనల్ చేసింది. ఐతే టికెట్ దక్కలేదనే అసంతృప్తితో శ్రీహరిపై మాటల దాడి రాజయ్య మరింత ఎక్కువ చేసారు. దాంట్లో భాగంగానే తాజాగా మరోసారి కడియంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐతే స్టేషన్ ఘన్పూర్లో సొమ్మొకడిది,సోకొకడిది అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని ఘాటుగా స్పందించారు.ఐతే తాను ఇక్కడే ప్రజల్లో ఉండి అభివృద్ది పనులు చేస్తుంటే వాటిని తన ఖాతాలో వేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నారని కడియంను ఉద్దేశించి ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేసారు.ఐతే ఇది ఎంత దూరం పోతుందో అని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
