ఎమ్మెల్యే వర్సెస్ కార్యకర్త.. జనసేనలో వింత వాతావరణం..!

పోలవరం జనసేనలో రచ్చ రచ్చ

Share this :

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీలో అంతర్గత వర్గపోరు ఒక్కసారిగా రోడ్డుకెక్కింది. స్థానిక జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనుచరులు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారంటూ పార్టీ కార్యకర్త సతీష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ దాడిలో గాయపడిన సతీష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవిందరావు ఆసుపత్రికి వెళ్లి సతీష్‌ ను పరామర్శించారు. ఈ ఉదంతంపై ఆయన స్పందిస్తూ.. ఇరువర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఎవరికీ పక్షపాతం వహించకుండా, నిష్పాక్షికంగా సమగ్ర విచారణ జరిపి నిజా నిజాలు తేల్చాలని కోరారు.

Also Read: యూట్యూబర్ రావణ్ ఇంట్లో ఏపీ పోలీసులు, కీలక రికార్డులు స్వాధీనం..!

మరోవైపు ఈ వివాదం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్యకర్త సతీష్ ఆరోపణలను ఖండిస్తూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనుచరులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట చేరి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే బాలరాజును, ఆయన వర్గాన్ని టార్గెట్ చేస్తూ సతీష్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా అనుచిత, వ్యక్తిగత దూషణలతో కూడిన పోస్టులు పెడుతున్నాడని ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న సతీష్‌ పై పోలీసులు తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Also Read: హెచ్-1బీ వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. జేడీ వెన్స్ సంచలన వార్నింగ్

ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే వర్గం మరియు కార్యకర్త వర్గం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటం, పోలీస్ స్టేషన్ వద్ద ఇరువర్గాలు మొహరించడంతో పోలవరంలో రాజకీయ కలకలం రేగింది. నియోజకవర్గంలో పార్టీ కేడర్ రెండుగా చీలిపోవడంతో ఈ అంతర్గత వివాదాన్ని సర్దుమణిగేలా చేయడానికి జనసేన అధిష్టానం మరియు జిల్లా ముఖ్య నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

leave a reply